ఏపీ లో ప్రారంభమయిన శాసనమండలి సమావేశాలు


ఏపీ శాసనమండలి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. వరుసగా నాలుగోరోజు కూడా జంగారెడ్డి గూడెం కల్తీ సారా మరణాలపై టీడీపీ నిరసనకు దిగింది. ప్రభుత్వ తీరును తప్పుపడుతూ నినాదాలు చేశారు. కాగా నినాదాలు మధ్యే చైర్మన్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు.సభలో డొక్కా మాణిక్య వర ప్రసాద్ మాట్లాడుతూ... దేవాలయాల్లో అన్ని కులాలకు అన్నదాన సత్రాలు ఉన్నాయని... మాదిగలకు అన్నదాన సత్రాలు లేవని తెలిపారు. మాదిగ కులానికి అన్నదాన సత్రాలు ఏర్పాటుకు స్ధలాలు కేటాయించాలని కోరారు.దీనిపై మంత్రి వెల్లంపల్లి సమాధానమిస్తూ... శ్రీశైలంలో మాదిగలకు అన్నదాన సత్రం ఏర్పాటుకు అవసరం అయిన స్ధలాన్ని కేటాయిస్తామని తెలిపారు. సీఎం జగన్ కూడా ఈ విషయంపై సానుకూలంగా స్పందించారన్నారు. టీడీపీ హయాం నుంచి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాదిగలకు అన్నదాన సత్రానికి స్ధలం కేటాయించాలన్న నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి విమర్శించారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com