కరోనా వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ పెంచితే కరోనా వ్యాప్తిని అడ్డుకోలేం: అమెరికా నిపుణులు


కరోనా వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ పెంచితే ముప్పు తప్పదని యూఎస్ అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంథోనీ ఫౌచి హెచ్చరించారు. వ్యాక్సిన్‌కు సంబంధించిన రెండు మోతాదుల మధ్య గ్యాప్‌ పొడిగించడం వల్ల కరోనా వ్యాప్తి పెరుగుతుందని అన్నారు. భారతదేశంలో గత నెలలో ప్రభుత్వం రెండు మోతాదుల కోవిషీల్డ్ మధ్య గ్యాప్‌ను 12 నుంచి 16 వారాలకు పెంచిన నేపధ్యంలో ఫౌచీ ప్రకటనకు అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది.
వ్యాక్సిన్ రెండు మోతాదుల మధ్య గ్యాప్‌ పెంచడం వ్యాక్సిన్ ప్రభావాన్ని పెంచుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే వ్యాక్సినేషన్‌లో గ్యాప్‌ పెంచడానికి బదులుగా నిర్దేశిత షెడ్యూల్‌ను అనుసరించాలని ఫౌచీ సూచించారు. వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి వీలైనంత త్వరగా టీకాలు వేయాల్సిన అవసరం ఉందన్నారు. డెల్టా వేరియంట్ తొలుత భారత్‌లోనే కనిపించిందని, ఇది సెకెండ్ వేవ్‌కు ప్రధాన కారణంగా నిలిచిందన్నారు. డెల్టా వేరియెంట్లు దేశంలోని అనేక రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి చెందాయన్నారు. కరోనా థర్ఢ్ వేవ్‌కు అడ్డుకట్ట వేయాలంటే ప్రజలకు వీలైనంత త్వరగా టీకాలు వేయాలన్నారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com