నాలుగో‘సారీ’!


కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు మళ్లీ చుక్కెదురయ్యింది. ప్రధాని మోదీ ఆయనకు వరుసగా నాలుగోసారి అపాయింట్‌మెంట్‌ తిరస్కరించారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలలో పాల్గొనేందుకు విజయన్‌ ఢిల్లీ వచ్చారు. కేరళకు రేషన్‌ కేటాయింపులో వివక్ష చూపడంపై రాష్ట్రానికి చెందిన అఖిలపక్ష నేతలతో కలిసి.. పీఎం అపాయింట్‌మెంట్‌ కోరారు. 2016 నవంబరు నుంచి విజయన్‌కు ప్రధాని అపాయింట్‌మెంట్‌ తిరస్కరించడం ఇది నాలుగోసారి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ మధ్య ఘర్షణను నివారించేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరుతూ విజయన్‌ ఇటీవల మోదీకి లేఖ రాశారు. విజయన్‌, ఏపీ సీఎం చంద్రబాబు సహా.. మరో ఇద్దరు సీఎంలతో ఇటీవల ఢిల్లీలో కేజ్రీవాల్‌ భార్య సునీతను కలిసి తమ మద్దతు తెలిపారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com