యాదాద్రికి బయలుదేరిన బీజేపీ జనచైతన్య రథం


బీజేపీ జనచైతన్య యాత్ర నేటి నుంచి ప్రారంభంకానుంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ బషీర్‌బాగ్‌లోని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, దత్తాత్రేయ, చింతల, ప్రభాకర్, సీనియర్ నాయకులు, వేలాదిమంది కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈ యాత్రతో యుద్ధం ప్రకటించామని, జన చైతన్య యాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. కుటుంబ పాలనకు శుభం పలుకుతామని లక్ష్మణ్ తెలిపారు.

అనంతరం బషీర్‌బాగ్ నుంచి నుంచి యాదాద్రికి జనచైతన్య రథం బయలుదేరింది. లక్ష్మీనారసింహుడి ఆలయంలో పూజలు నిర్వహించి బహిరంగ సభలో నేతలు పాల్గొననున్నారు. తెలంగాణలో నేటి నుంచి 14 రోజుల పాటు బీజేపీ జనచైతన్య యాత్ర చేయనుంది. 9 జిల్లాల్లో ఈ యాత్ర సాగనుంది. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ యాత్ర చేయనున్నట్లు పార్టీనేతలు చెబుతున్నారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com