కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన దానం


ఒకే వర్గానికి చెందిన నేతల వల్లే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దుర్భరంగా మారిందని దానం నాగేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేసిన తర్వాత ఆయన మొదటి ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ పార్టీ కోసం కష్టపడుతున్నారని, అయితే పార్టీలో ఉన్న కొందరు నేతలు ఇతర సామాజిక వర్గ నేతల్ని ఎదగనీయకుండా అడ్డుపడుతున్నారని ఆరోపంచారు.

వరంగల్‌లో జరిగిన పార్టీ మీటింగ్‌కి పొన్నాల లక్ష్యయ్యకు సమాచారం లేకపోవడాన్ని బట్టి పార్టీలో బీసీల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని దానం అన్నారు. పార్టీ సీనియర్ నేత హనుమంతరావు కేవలం పేరు చెప్పుకోవడానికేనని అన్నారు. వార్తా పత్రికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా వార్త వస్తే సీఎం అభ్యర్థులంతా ఢిల్లీకి పరుగెత్తుతారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో బీసీల జనాభా 1.67కోట్లని, ఎన్నికలను ప్రభావితం చేయగలిగే శక్తి ఉన్న బీసీలకు పార్టీ పదవుల్లో, అధికారాల్లో మాత్రం ప్రాధాన్యత లేదని దానం అన్నారు. ఈ మధ్యే నిర్వహించిన పార్టీ సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చిందని, అన్ని జిల్లాలకు చెందిన బీసీ నేతలు ఈ విషయమై ఆవేదన వ్యక్తం చేశారని దానం వెల్లడించారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com