టీడీపీటీఎస్కు మోహన్రెడ్డి గుడ్బై
టీడీపీటీఎస్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారం లిమిటెడ్ మాజీ అధ్యక్షుడు మోహన్రెడ్డి శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. నిజామాబాద్లోని ప్రెస్క్లబ్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితుడినై టీఆర్ఎ్సలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ నెల 25న రెండు వేల మంది కార్యకర్తలతో తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. తనతోపాటు బోధన్కు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు రచ్చ సుదర్శన్, భూమా నాగేశ్వర్, జనార్దన్రెడ్డి, సత్యనారాయణ పార్టీ పదవులకు రాజీనామా చేసినట్లు తెలిపారు. తమ రాజీనామా లేఖలను టీడీపీటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రమణకు పంపించినట్లు వెల్లడించారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని టీడీపీటీఎస్ జడ్చర్ల జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ స్పష్టం చేశారు. జడ్చర్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ మార్పు,పార్టీ మార్పు అంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కుండబద్దలు కొట్టారు.
Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు