ట్రిపుల్‌ సెంచరీ చేసిన సల్మాన్‌ఖాన్‌


బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ బాక్సాఫీసు వద్ద ట్రిపుల్‌ సెంచరీ చేశారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘టైగర్‌ జిందా హై’. అలీ అబ్బాస్‌ జఫర్ దర్శకత్వం వహించారు. కత్రినా కైఫ్‌ కథానాయిక పాత్ర పోషించారు. డిసెంబరు 22న విడుదలైన ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను రాబడుతోందని సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నారు. సినిమా దేశవ్యాప్తంగా శుక్రవారం (జనవరి 5) రూ.3.72 కోట్లు, శనివారం రూ.5.62 కోట్ల్లు.. మొత్తం రూ.300 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. దీంతో ‘టైగర్‌ జిందా హై’.. ‘సుల్తాన్‌’ రికార్డును క్రాస్‌ చేసిందని తెలిపారు. ఇప్పుడు ‘బజరంగీ భాయ్‌జాన్‌’ రికార్డును అధిగమించే దిశగా పరుగులు తీస్తోందన్నారు. సల్మాన్‌, కరీనా కపూర్‌ జంటగా నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా మొత్తం రూ.320.34 కోట్లు వసూలు చేసింది.

యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ‘టైగర్‌ జిందా హై’ను నిర్మించారు. విశాల్‌-శేఖర్‌, జులియస్‌ పాకియమ్‌ సంగీతం అందించారు. మార్కిన్‌ లస్కవీస్‌ సినిమాటోగ్రఫీ అందించారు. 2012లో విడుదలైన ‘ఏక్‌ థా టైగర్‌’ మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు కబీర్‌ ఖాన్‌ తెరకెక్కించిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘టైగర్ జిందా హై’ను రూపొందించారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com