తైజుకు సింధు షాక్
ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో శనివారం చెన్నై స్మాషర్స్ జట్టు 2-1తో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్పై విజయం సాధించింది. మొదట పురుషుల డబుల్స్లో రెకినాల్డ్-నందగోపాల్ జంట 15-13, 15-12తో క్రిస్ అడకాక్- యాంగ్లీ ద్వయంపై నెగ్గడంతో అహ్మదాబాద్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఐతే తర్వాతి మ్యాచ్లో సింధు 15-11, 10-15, 15-12తో ప్రపంచ నంబర్వన్ తైజు యింగ్ను మట్టికరిపించడంతో చెన్నై స్కోరు సమం చేసింది. మూడో మ్యాచ్ను చెన్నై ట్రంప్ మ్యాచ్గా ఎంచుకోగా.. ఆ జట్టు ఆటగాడు లెవెర్డెజ్ 15-12, 12-15, 14-15తో సౌరభ్ వర్మ చేతిలో ఓడిపోయాడు. ఐతే చెన్నై చివరి రెండు మ్యాచ్ల్లో పుంజుకుని పోరులో విజేతగా నిలిచింది. అహ్మదాబాద్ ట్రంప్ మ్యాచ్ అయినా నాలుగో మ్యాచ్లో సెన్సోంబూన్సుక్ (చెన్నై) 15-10, 12-15, 15-14తో హెచ్.ఎస్.ప్రణయ్పై నెగ్గగా.. పీవీ సింధు, సుమీత్ రెడ్డి జోడీ 15-14, 15-13తో రెగినాల్డ్- కమిలా జుల్ (అహ్మదాబాద్) జంటను ఓడించింది.
Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు